మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీజేపీ నాయకులు
On
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు వెంకట రమణ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బిజెపి కార్యకర్త బీనమైన కనకయ్య ఆత్మహత్య చేసుకోవడం జరిగిన విషయం తెలుసుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని,బీజేపీ పార్టీ క్రియాశీల కార్యకర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు,సమస్యకి ఆత్మహత్య పరిష్కారం కాదని జీవితంలో కష్టాలని ఎదుర్కోవాలని అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇటీవల యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని బాదని వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్ రెడ్డి, బారు అరవింద్, వ్యాస బట్టు వేణు, నోముల మహేందర్, జూలకంటి ప్రభాకర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు
Tags: Siddipet
Related Posts
Latest News
22 Jan 2025 01:06:01
నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు...