Telangana Sena
తెలంగాణ 

మాజీ సర్పంచ్ బండారు మల్లయ్యపై దాడి చేయడం అమానుషం

మాజీ సర్పంచ్ బండారు మల్లయ్యపై దాడి చేయడం అమానుషం నల్గొండ జిల్లా : నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్నెబోయిన సుధాకర్ మాట్లాడుతూ ఉప్పలంచ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బండారు మల్లయ్య పై గుర్తుతెలియని దుండగులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.2 సార్లు సర్పంచ్ గా గ్రామానికి విశిష్ట సేవలు అందిస్తూ గ్రామ అభివృద్ధిలో ముందుండి కుల మత బేధం లేకుండా అందరికీ తలలో నాలుకగా ఉండే సౌమ్యుడై అయిన బండారు మల్లయ్య ను చంపే ప్రయత్నం చేశారన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో తమ ఊరిలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన నేపథ్యంలో కొందరు వ్యక్తులు మాటు వేసి అతనిపై మూకుమ్మడిగా కత్తులతో,రాడ్ఠులతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచి చంపే ప్రయత్నం చేశారన్నారు.మల్లయ్య ప్రస్తుతం హాస్పిటల్ లో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారని, ఎంతో సౌమ్యుడిగా ఉటూ ఎవరికి కూడా హానికలిగించకుండా ఉండే వ్యక్తిని ఇలా చేయడం అనేది హేయమైన చర్య అన్నారు.ఈ చర్యకు పాల్పడిన వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని, వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు. చేశారు. అనుమానితులకు విచారణ జరిపి దాడి వెనుక ఉన్న కుట్రను బయటికి తీసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో మాజీ వైస్ యంపీపి భూపతి అంజయ్య,మాజీ సర్ప చ్ అల్లి సైదులు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడాల రమేష్, మండల కాంగ్రెస్ నాయకులు పెరమండ్ల నరేష్ ,బొల్లికొండ గణేష్, కడారి అంజయ్య,వంగూరి వెంకన్న , మొగుల్ల శ్రీను,లోడె సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Read...
తెలంగాణ 

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీజేపీ నాయకులు

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీజేపీ నాయకులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచెడ్ గ్రామంలో మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీజేపీ రాష్ట్ర నాయకుడు వెంకట రమణ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ బిజెపి కార్యకర్త బీనమైన కనకయ్య ఆత్మహత్య చేసుకోవడం జరిగిన విషయం తెలుసుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని,బీజేపీ పార్టీ క్రియాశీల కార్యకర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు,సమస్యకి ఆత్మహత్య పరిష్కారం కాదని జీవితంలో కష్టాలని ఎదుర్కోవాలని అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇటీవల యువత ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని బాదని వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్ రెడ్డి, బారు అరవింద్, వ్యాస బట్టు వేణు, నోముల మహేందర్, జూలకంటి ప్రభాకర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు
Read...

About The Author